ప్రధాన మంత్రి కార్యాలయం

‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ లో భూమి పూజ ను నిర్వహించిన ప్రధాన మంత్రి


పరస్పర ప్రేమ మరియు సోదరత్వాల పునాది మీద మందిర నిర్మాణం జరగాలి: ప్రధాన మంత్రి

‘సబ్ కా సాథ్’, ఇంకా ‘సబ్ కా విశ్వాస్’ ల ద్వారా ‘సబ్ కా వికాస్’ను మనం సంపాదించవలసి ఉన్నది: ప్రధాన మంత్రి

రామ మందిరం మన సంస్క్రుతి, చిరకాలిక విశ్వాసం, జాతీయ భావన మరియు సామూహిక ఇచ్ఛా శక్తి ల యొక్క ఓ ఆధునిక ప్రతీక కానుంది; రామ మందిరం భావి తరాల కు ప్రేరణనివ్వగలుగుతుంది: ప్రధాన మంత్రి

మందిర నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ను మార్చివేయగలుగుతుంది: ప్రధాన మంత్రి

రామ మందిరం స్వప్న సాక్షాత్కారానికై సంఘర్షించిన వారి ని స్మరించుకొంటూ వారికి వందనాన్ని

ఆచరించిన ప్రధాన మంత్రి; వారి సంఘర్షణ లే రామ మందిర సాకారానికి బాట పరచాయని ఉద్ఘాటన

శ్రీ రాముడు దేశం లో ఏకత అనే ఒక ఉమ్మడి పాశం గా నిలుస్తున్నారు: ప్రధాన మంత్రి

ప్రస్తుత కోవిడ్ స్థితి‘దో గజ్ కీ దూరీ - మాస్క్ హైఁ జరూరీ’ అనే ‘మర్యాద’ కై పట్టు పడుతున్నది అని వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి

Posted On: 05 AUG 2020 2:29PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అయోధ్య లో ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’వద్ద భూమి పూజ ను నిర్వహించారు.
 
భారతదేశానికి ఒక భవ్యమైనటువంటి అధ్యాయం

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ యొక్క పావన తరుణం లో తోటి దేశ వాసుల కు మరియు ప్రపంచ వ్యాప్తం గా కల రామ భక్త జనుల కు అభినందనలు తెలిపారు.  ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం అని ఆయన పేర్కొంటూ భారతదేశం ఈ రోజు న ఒక భవ్యమైనటువంటి అధ్యాయాన్ని మొదలుపెడుతోందని, ఇది దేశవ్యాప్త ప్రజానీకం
ఉత్తేజితులైనటువంటి ఘడియ, వారు శతాబ్దాల తరబడి వేచి ఉన్న దానిని ఎట్టకేల కు సాధించుకొన్నటువంటి సాఫల్యం, వారిలో అనేకులు వారి యొక్క జీవన కాలం లో నేడు చోటు
చేసుకొంటున్న ఒక ఘటన కు సాక్షీభూతం గా వారు నిలచారన్న సంగతి ని ఒక పట్టాన నమ్మలేకపోతున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  శిథిలం కావడం మరియు తిరిగి నిర్మాణానికి
నోచుకోవడం అనేటటువంటి ఒక చక్రభ్రమణం నుండి రామ జన్మభూమి విముక్తం అయిందని, మరి గుడారాల కు బదులు గా రాంలలా కు ప్రస్తుతం ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుందని ఆయన ప్రముఖం గా ప్రకటించారు.

ఆగస్టు 15వ తేదీ దేశం అంతటా ప్రజలు స్వాతంత్ర్య సమరం దిశ గా ఒనరించిన త్యాగాల కు ఒక ప్రతినిధి గా ఉన్న విధంగానే, ఈ రోజు రామ మందిరం కోసం తరాల తరబడి చేస్తూ వచ్చిన సతత త్యాగాలు మరియు ఎనలేని సమర్పణ భావాల కు సూచకం గా నిలచిపోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  రామ మందిరం అనే కల పండినందుకు ఆ క్రమం లో సంఘర్షణలను సలిపినటువంటి వారందరిని ఆయన గుర్తుకు తెచ్చుకొంటూ వారికి వందనాన్ని ఆచరించారు.

శ్రీ రాముడు - మన సంస్క్రుతి కి పునాది

శ్రీ రాముని యొక్క ఉనికి ని తుడిచివేయడం కోసం అనేక యత్నాలు జరిగినప్పటికీ, శ్రీ రాముడు మన సంస్క్రుతి కి ఒక పునాది గా ఉంటూ వచ్చారని ప్రధాన మంత్రి అన్నారు.  రామ ఆలయం మన సంస్క్రుతి కి, చిరకాలిక విశ్వాసానికి, జాతీయ భావన కు మరియు సామూహిక ఇచ్చా శక్తి కి ఒక ఆధునిక సంకేతం గా ఉంటుందని, ఇది రాబోయే తరాల కు ప్రేరణనిస్తూ ఉంటుందని ఆయన చెప్పారు.  దేవాలయ నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ను మార్చివేయగలుగుతుందని, వివిధ రంగాల లో అనేక అవకాశాల ను కల్పించగలదని ఆయన అన్నారు.


ఈ దినం కోట్లాది రామ భక్తుల సంకల్పానికి మరియు విశ్వాస సంబంధిత యథార్థానికి ఒక నిదర్శనం గా నిలచిపోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  గడచిన సంవత్సరం లో గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం ప్రతి ఒక్కరి భావాల ను పరిగణన లోకి తీసుకొని తీర్పు ను వెలువరించిన వేళ లో, తోటి దేశవాసులు సంయమనం తో, హుందాతనం తో నడుచుకొన్న తీరు ను ఆయన ప్రశంసిస్తూ, ఈ రోజు న కూడాను అదే మాదిరి నిగ్రహం, ఇంకా హుందాతనం వ్యక్తం అవుతూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

శ్రీ రాముని విజయం, గోవిందుడు గోవర్ధన పర్వతాన్ని గోటి తో ఎత్తి పట్టుకోవడం, ఛత్రపతి శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించడం, గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించడం ఇత్యాది  అనేక గొప్ప కార్యాల లో పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీ లు సహా అన్ని జీవన రంగాల కు చెందిన వారు వారి వంతు పాత్రల ను ఎలా పోషించారో ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.  అదే విధం గా, రామ మందిర నిర్మాణం సామాన్య పౌరుల యొక్క తోడ్పాటు తో, వారి సహాయం తో మొదలైందని ఆయన అన్నారు.

శ్రీ రాముని గుణ స్వభావాల ను ప్రధాన మంత్రి మననం చేసుకొంటూ, శ్రీ రాముల వారు ఎల్లవేళ ల సత్యవ్రత దీక్ష పూనారని, ఇంకా సామాజిక సమభావన ను తన పాలన కు ఆధారభూతమైనటువంటి ఒక మూలస్తంభం గా నెలకొల్పారన్నారు.  శ్రీ రాముడు తన ప్రజల ను సమానమైన రీతి న ఆదరించారని, అయితే పేదలన్నా, ఆపన్నులన్నా ఆయన ప్రత్యేకమైన దయ ను చూపారన్నారు.  శ్రీ రాముడు ఒక స్ఫూర్తి గా కానగ రాని జీవన కోణమంటూ ఏ ఒక్కటయినా లేదు, మరి దేశం యొక్క సంప్రదాయం, విశ్వాసం, దర్శనం, సంస్క్రుతి ల తాలూకు పలు పార్శ్వాల లో ఆయన ప్రభావం సాక్షీభూతంగా నిలుస్తూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు.  

శ్రీ రామ్ - భిన్నత్వంలో ఏకత్వానికి ఆధారం :

పురాతన కాలంలో వాల్మీకి రామాయణం ద్వారా, మధ్యయుగ కాలంలో తులసీదాస్, కబీర్ మరియు గురునానక్ ద్వారా శ్రీరాముడు ప్రజలకు మార్గదర్శక కాంతిగా వ్యవహరించారనీ, అదేవిధంగా ఆధునిక కాలంలో అహింసా, సత్యాగ్రహ శక్తి వనరుగా మహాత్మా గాంధీ భజనల్లో కూడా శ్రీరాముడు ఉన్నాడని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  బుద్ధ భగవానుడు కూడా శ్రీ రామునితో సంబంధం కలిగి ఉన్నాడనీ, అయోధ్యా నగరం శతాబ్దాల నుండి జైనుల విశ్వాస కేంద్రంగా ఉందనీ, ఆయన వివరించారు.  వివిధ భాషలలో వ్రాయబడిన అనేకానేక రామాయణాలను గురించి ప్రధానమంత్రి తెలియజేస్తూ, దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి శ్రీరాముడు ఆధారంగా నిలిచాడని పేర్కొన్నారు. 

శ్రీ రాముడు అనేక దేశాలలో గౌరవించబడ్డాడని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా వంటి దేశాలలో ప్రాచుర్యం పొందిన రామాయణాల జాబితాను ఆయన తెలియజేశారు.  కంబోడియాలావోస్మలేసియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ దేశాలతో పాటు ఇరాన్ లో కూడా శ్రీరామునికి సంబంధించిన విశేషాలు ప్రచారంలో ఉన్నాయనీ, రామకథలు అనేక దేశాల్లో ప్రసిద్ధి చెందాయనీ ప్రధానమంత్రి వివరించారు.  రామ మందిరం నిర్మాణం ప్రారంభం కావడంతో ఈ దేశాలన్నిటిలో ప్రజలు ఈ రోజు తప్పక సంతోషంగా ఉండి ఉంటారని ఆయన పేర్కొన్నారు.  

మొత్తం మానవజాతికి ప్రేరణ

ఈ ఆలయం రాబోయే కాలాలోని మొత్తం మానవాళికి ప్రేరణగా నిలుస్తుందని, ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  శ్రీ రాముడు, రామ మందిరంతో పాటు మన పురాతన సంప్రదాయం యొక్క సందేశం మొత్తం ప్రపంచానికి చేరడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిని  దృష్టిలో ఉంచుకునే, దేశంలో "రామ్ సర్క్యూట్" ని  రూపొందించడం జరుగుతోంది. 

రామ రాజ్యం :

మహాత్మా గాంధీ కలలుగన్న రామరాజ్యం యొక్క ఆకృతులను ప్రధానమంత్రి వివరించారు.  దేశానికి మార్గనిర్దేశం చేస్తూ కొనసాగుతున్న శ్రీ రాముని ఆశయాలను ఆయన వివరించారు.  

వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.   

ఎవరూ పేదగా లేదా విచారంగా  ఉండకూడదు;  పురుషులు, మహిళలు సమానంగా సంతోషంగా ఉండాలి.  రైతులు, జంతు సంరక్షకులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి;  చిన్న పిల్లలూ, వృద్దులు, వైద్యులు ఎల్లప్పుడూ రక్షించబడాలి;  ఆశ్రయం కోరుకునే వారిని రక్షించడం మనందరి కర్తవ్యం;  మాతృభూమి స్వర్గం కంటే ఎక్కువ;  ఒక దేశానికి ఎంత ఎక్కువ శక్తి ఉంటే, ఆ దేశంలో శాంతికి అంత ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. 

శ్రీ రాముడు ఆధునికతతో పాటు మార్పుకు కూడా విలువ ఇస్తాడని ప్రధానమంత్రి  అన్నారు. శ్రీ రాముని యొక్క ఈ ఆదర్శాలను అనుసరించే, మన దేశం అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

పరస్పర ప్రేమ, సోదర భావానికి పునాది :

పరస్పర ప్రేమ, సోదరభావం పునాదిపై ఈ ఆలయాన్ని నిర్మించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.  'సబ్ కా సాత్', 'సబ్ కా విశ్వస్' ద్వారా, మనం 'సబ్ కా వికాస్' సాధించి, ఆత్మవిశ్వాసం మరియు స్వావలంబన కలిగిన భారతదేశాన్ని తయారు చేసుకోవాలని ఆయన సూచించారు.  జాప్యం లేకుండా, ముందుకు సాగాలన్న శ్రీ రాముని సందేశాన్ని మనం తప్పక అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన ఆయన నొక్కిచెప్పారు.

కోవిడ్ సమయంలో ‘మర్యాద’

శ్రీ రాముని  ‘మర్యాద’ మార్గం ప్రాముఖ్యతను కోవిడ్ పరిస్థితి నేపథ్యంలో గుర్తుచేసుకుని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో, మర్యాద అంటే - "రెండు గజాల దూరం - మాస్కు ధరించడం తప్పనిసరి" అనీ, ప్రతి ఒక్కరూ దీనిని అనుసరించాలనీ, ఆయన సూచించారు.

*****



(Release ID: 1643548) Visitor Counter : 258