రైల్వే మంత్రిత్వ శాఖ

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద భారతీయ రైల్వే 6 రాష్ట్రాల్లో (బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) 5.5 లక్షలకు పైగా పనిదినాలను ఉత్పత్తి చేసింది.

ఈ ప్రాజెక్టులలో సాధించిన పురోగతిని, ఈ పథకం కింద ఈ రాష్ట్రాల వలస కార్మికుల కోసం సృష్టించిన ఉపాధి అవకాశాలను, రైల్వే మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది

అమలులో ఉన్న ప్రాజెక్టుల కోసం, 2020 ఆగస్టు 14వ తేదీ వరకు 1336.84 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం విడుదల చేయడం జరిగింది.

6 రాష్ట్రాలలోని 116 జిల్లాల్లో గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ అమలులో ఉంది.

ఈ రాష్ట్రాల్లో 2,988 కోట్ల రూపాయల విలువైన 165 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.

Posted On: 16 AUG 2020 4:04PM by PIB Hyderabad

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద భారతీయ రైల్వే 6 రాష్ట్రాల్లో (బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) 5.5 లక్షలకు పైగా పనిదినాలను ఉత్పత్తి చేసింది. 

ఈ ప్రాజెక్టులలో సాధించిన పురోగతి గురించీ, ఈ పథకం కింద ఈ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు కల్పిస్తున్న పని అవకాశాల గురించీ, కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్, నిశితంగా పరిశీలిస్తున్నారు.  ఈ రాష్ట్రాల్లో 2,988 కోట్ల రూపాయల విలువైన 165 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.  ఈ  అభియాన్‌లో, 2020 ఆగష్టు, 14వ తేదీ వరకు 11,296 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు.   అమలులో ఉన్న ప్రాజెక్టుల కోసం 1,336.84 కోట్లరూపాయల మేర  చెల్లింపులను కాంట్రాక్టర్లకు విడుదల చేశారు.

ప్రతి జిల్లాలో మరియు రాష్ట్రాలలో రైల్వే శాఖ నోడల్ అధికారులను నియమించింది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది. వలసదారులను నిర్ధారించి, ప్రాజెక్టులలో నిమగ్నం చేసి,  తదనుగుణంగా చెల్లించడానికి గాను, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ సంబంధిత జోనల్ స్థాయిలో రైల్వే పరిపాలనా అధికారులను ఆదేశించారు  

ఈ పథకం కింద అమలు చేయడం కోసం రైల్వే శాఖ అనేక రైల్వే పనులను గుర్తించింది. వీటిలో,  (i) లెవల్ క్రాసింగ్‌ల కోసం అప్రోచ్ రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ;  (ii)  రైలు మార్గం వెంట సిల్టెడ్ జలమార్గాలు, కందకాలు మరియు కాలువల అభివృద్ధి మరియు శుభ్రపరచడం;  (iii) రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ;  (iv) ఇప్పటికే ఉన్న రైల్వే కట్టలు / కోతల మరమ్మతులు మరియు వెడల్పు;  (v) రైల్వే భూముల్లోనూ, సరిహద్దుల్లోనూ చెట్ల పెంపకం;  (vi) ఇప్పటికే ఉన్న కట్టలు / కోత / వంతెనల రక్షణ పనులకు సంబంధించిన పనులు ఉన్నాయి. 

వినాశకరమైన కోవిడ్-19 చేత ప్రభావితమై పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చిన ప్రాంతాలు / గ్రామాలలో జీవనోపాధి అవకాశాలను శక్తివంతం చేయడం కోసం, గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ అనే భారీ ఉపాధి-గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమాన్ని 2020 జూన్ 20వ తేదీన ప్రారంభించారు.  గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

125 రోజుల పాటు కొనసాగే ఈ అభియాన్, మిషన్ మోడ్‌లో చేపడుతున్నారు. 116 జిల్లాల్లో 25 రకాల పనులు / కార్యకలాపాలను కేంద్రీకరించడం జరిగింది.  6 రాష్ట్రాల్లో (బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశాలోని) తిరిగి వచ్చిన వలస కార్మికులు అధికంగా ఉన్నారు.  ఈ అభియాన్ లో భాగంగా 50,000 కోట్ల రూపాయల మేర ప్రజా పనులు జరుగుతున్నాయి. 

ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు / విభాగాల మధ్య సమన్వయంతో పనిచేస్తోంది. అవి,  గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్; రోడ్డు రవాణా, రహదారులు, గనులు, త్రాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలపర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం, సహజ వాయువు,  నూతన, పునరుత్పాదక విద్యుత్తు, సరిహద్దు రోడ్లుటెలికాం, వ్యవసాయం. ఈ మంత్రిత్వ శాఖలు / విభాగాలలో 25 ప్రజా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికి,  జీవనోపాధి అవకాశాల వృద్ధికి సంబంధించిన పనులు చేపట్టడానికి, ఈ అభియాన్ ద్వారా కృషి జరుగుతోంది.   

*****



(Release ID: 1646330) Visitor Counter : 262