|
ప్రధాన మంత్రి కార్యాలయం
ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు
Posted On:
02 MAY 2022 8:09PM by PIB Hyderabad
- జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షతన నేడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆరవ విడత అంతర్-ప్రభుత్వ సంప్రదింపులు నిర్వహించాయి. ఇద్దరు నాయకులు కాకుండా ఉభయ దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్నత ప్రతినిధుల ప్రతినిధివర్గాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
- భారతదేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ భారత, జర్మనీల మధ్య ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, దేశీయ చట్టాలకు లోబడి పాలన, మానవ హక్కులు, ప్రపంచ సవాళ్లకు బహుముఖీన స్పందనతో కూడిన పరస్పర సహకారం లోతుగా పాదుకుంది. ప్రజలకు ఉమ్మడి ప్రయోజనాలతో కూడిన సేవలందిస్తున్నాయి.
- ప్రపంచ దేశాలు ఇతర దేశాల సార్వభౌమ హక్కులు, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి రూపొందించిన అంతర్జాతీయ చట్టాలకు లోబడిన నిబంధనల ఆధారిత విధానాలు అనుసరించాలని ఉభయ దేశాలు నొక్కి చెప్పాయి. వర్తమాన, భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగల రీతిలో బహుళ అంచెల్లో సంస్కరణల రూపకల్పన, పటిష్ఠతకు; ప్రపంచ శాంతి సుస్థిరతల పరిరక్షణకు, అంతర్జాతీయ చట్టాలకు కొత్త ఉత్తేజం అందించడానికి, సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలు సాధించాలనే ప్రాథమిక సూత్రాన్ని గౌరవించేందుకు; ప్రపంచ దేశాల సార్వభౌమ, ప్రాదేశిక హక్కుల పరిరక్షణకు ఉభయ దేశాల ప్రభుత్వాలు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి.
- కోవిడ్-19 నష్టాల నుంచి భూగోళాన్ని కాపాడేందుకు దోహదపడే విధంగా ఆర్థిక రికవరీ సాధించడం పట్ల ఇద్దరు నాయకులు తమ కట్టుబాటును ప్రకటించారు. పునరుత్పాదక ఇంధనానికి ఉత్తేజం కల్పించడం ద్వారా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల సగటు వృద్ధిని పారిశ్రామిక విప్లవ కాలం నాటి 2 డిగ్రీల సెంటిగ్రేడ్ కు, ఆ తర్వాత పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంలోని 1.5 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించాలన్న లక్ష్యాలకు గట్టి కట్టుబాటు ప్రకటించారు. 2030 స్థిర అభివృద్ధి లక్ష్యాలకు దీటుగా ఆర్థిక రికవరీ మరింత పటిష్ఠంగా, పర్యావరణ మిత్రంగా, వాతావరణ మిత్రంగా, భవిష్యత్త తరాలకు సమ్మిళితంగా ఉండాలని వారు నొక్కి చెప్పారు. అలాగే పారిస్ ఒప్పందానికి ఉభయ దేశాల కట్టుబాటును ప్రకటించారు.
ఉమ్మడి విలువలు; ప్రాంతీయ, బహుముఖీన ప్రయోజనాలతో కూడిన భాగస్వామ్యం
- ఐక్యరాజ్యసమితి కేంద్రంగా నిబంధనల ఆధారితమైన, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబాటు గల అంతర్జాతీయ వ్యవస్థ ప్రాధాన్యతను ఉభయ దేశాలు గుర్తించాయంటూ అందుకు సమర్థవంతమైన, సంస్కరించిన బహుళ భాగస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. వాతావరణ మార్పులు, పేదరికం, ప్రపంచ ఆహార భద్రత వంటి సవాళ్లు; తప్పుడు సమాచారం, అంతర్జాతీయ సంఘర్షణలు, సంక్షోభాలు, అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ముప్పు నేపథ్యంలో బహుళ భాగస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు తప్పనిసరి అన్న అంశం వారు మరోసారి నొక్కి చెప్పారు. “గ్రూప్ ఆఫ్ ఫోర్”లో దీర్ఘకాలిక సభ్యులుగా ఉభయ ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని నిర్దేశిత లక్ష్యానికి కృషి చేయదగినదిగా, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేదిగా తీర్చి దిద్దడానికి అవసరమైన సంస్కరణలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్న కట్టుబాటు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పరస్పర మద్దతు అందించుకోవడానికి ఉభయ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అణు సరఫరాదారుల బృందంలో సభ్యదేశంగా భారతదేశం ప్రవేశానికి గట్టి మద్దతును జర్మనీ పునరుద్ఘాటించింది.
- ఆసియాన్ కేంద్రంగా భారత-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, సమ్మిళితంగా ఉండాల్సిన ప్రాధాన్యతను ఉభయ వర్గాలు నొక్కి వక్కాణించాయి. జర్మన్ ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన విధాన మార్గదర్శకాలు, భారతదేశం ప్రతిపాదించిన ఇయు వ్యూహాత్మక ఇండో-పసిఫిక్ సహకారం, ఇండో-పసిఫిక్ సముద్ర చొరవ రెండింటి ప్రాధాన్యతను ఉభయులు పరస్పరం గుర్తించుకున్నారు. హిందూమహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం సహా అన్ని సముద్ర ప్రాంతాల్లోను అంతర్జాతీయ చట్టాలు ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి సాగర చట్ట ఒడంబడిక (అంక్లోస్), 1982 పరిధిలో అవరోధాలకు తావు లేని వ్యాపారం, నౌకారవాణా స్వేచ్ఛ రెండింటి ప్రాధాన్యతను ఉభయ దేశాలు నొక్కి చెప్పాయి. 2022 జనవరిలో జర్మనీ యుద్ధ నౌక “బైరెన్” ముంబై పోర్టుకు రావడాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జర్మనీ పెరుగుతున్న ప్రాధాన్యతలో ఒక కీలక మైలురాయిగా ఉభయ దేశాలు అభివర్ణించాయి. అలాగే వచ్చే ఏడాది జర్మనీ పోర్టుకు భారత నౌకాదళానికి చెందిన నౌక స్నేహపూర్వక రాకను జర్మనీ ఆహ్వానించింది.
- 2021 మే నెలలో పోర్టోలో జరిగిన భారత-ఇయు నాయకుల సమావేశం అనంతరం భారత, ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత లోతుగా పాదుకోవడాన్ని భారత్, జర్మనీ ఆహ్వానిస్తూ దాన్ని మరింత పటిష్ఠం చేయాలని అంగీకారానికి వచ్చాయి. భారత-ఇయు కనెక్టివిటీ భాగస్వామ్యం అమలుకు ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు. భారత-ఇయు వాణిజ్య, టెక్నాలజీ మండలి ప్రారంభం కావడం పట్ల ఉభయవర్గాలు సంతృప్తిని ప్రకటించారు. వాణిజ్యం మరింత బిగిగా అల్లుకోవడం, విశ్వసనీయ టెక్నాలజీ, సెక్యూరిటీ వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనడంలో ఈ మండలి మరింత కీలకం కాగలదని ఉభయులు అంగీకరించారు.
- బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ సాంకేతిక-ఆర్థిక సహకార అంగీకారం (బిమ్ స్టెక్) వంటి ప్రాంతీయ సంఘాలు, జి-20 వంటి బహుముఖీన వేదికల్లో ఉభయ వర్గాలు సహకారం మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉభయులు నొక్కి వక్కాణించారు. భారతదేశం 2023లో జి-20కి అధ్యక్షత వహించే కాలంలో మరింత సన్నిహిత సహకారానికి ఎదురు చూస్తున్నట్టు భారత, జర్మనీ ప్రకటించాయి. జి-20 విషయంలో భారతదేశం ప్రకటించిన ప్రాధాన్యతలను జర్మనీ ఆహ్వానిస్తూ ఉమ్మడి ప్రపంచ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు శక్తివంతమైన జి-20 కార్యాచరణ రూపకల్పనకు కలిసికట్టుగా కృషి చేయడానికి అంగీకరించింది.
- జి-7 దేశాల బృందానికి, భారతదేశానికి మధ్య గల సన్నిహిత సహకారంతో పాటు జి-7కు ప్రస్తుతం జర్మనీ అధ్యక్షత వహిస్తున్న సమయంలో న్యాయబద్ధమైన ఇంధన పరివర్తన సహా భిన్న అంశాలపై సహకారాన్ని ఉభయ దేశాలు గుర్తించాయి. ప్రస్తుత జి-7 జర్మనీ నాయకత్వంలో వాతావరణ సమతూకమైన ఇంధన విధానాలు, పునరుత్పాదక ఇంధనం త్వరితగతిన విస్తరణ, సుస్థిర ఇంధనం వంటి అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, అందుబాటులో ఉన్న అవకాశాల ఆధారంగా న్యాయబద్ధమైన ఇంధన పరివర్తనకు మార్గాలను అన్వేషించాలని అంగీకరించారు. విభిన్న రంగాల్లోను ప్రత్యేకించి ఇంధన రంగంలోను ఉపశమనపూర్వకమైన వాతావరణ మార్పుల విధానం అనుసరించడం కూడా ఇందులో భాగం.
- ఎలాంటి కవ్వింపులు లేకుండానే రష్యన్ బలగాలు చట్టవిరుద్ధంగా ఉక్రెయిన్ పై దాడి చేయడంపై తన ఖండనను జర్మనీ పునరుద్ఘాటించింది.
ఉక్రెయిన్ సంక్షోభ కాలంలోలో తలెత్తిన మానవతా ఉల్లంఘన పట్ల జర్మనీ, భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చాయి. ఉక్రెయిన్ లో అమాయకులైన పౌరుల మరణాలను ఉభయ దేశాలు తీవ్రస్వరంతో ఖండించాయి. దాడులు తక్షణం ఆపాలని వారు పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నియమావళి ఆధారంగా నిర్మించిన అంతర్జాతీయ చట్టాలు, ప్రపంచ దేశాల సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రతల పట్ల గౌరవంతో కూడిన సమకాలీన ప్రపంచ నియమావళిని తక్షణం ఆచరించాలని వారు నొక్కి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రాంతీయంగాను, ప్రపంచ స్థాయిలోను ఏర్పడుతున్న అస్థిరత ప్రభావం గురించి ఉభయులు చర్చించారు. ఈ అంశంపై సన్నిహితంగా సహకరించుకోవాలని వారు అంగీకారానికి వచ్చారు.
- ఆఫ్గనిస్తాన్ లో నెలకొన్న తీవ్ర మానవతా సంక్షోభం; లక్ష్యపూరిత ఉగ్రవాద దాడులు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల వ్యవస్థాత్మక ఉల్లంఘన, మహిళలు, బాలికలకు విద్యావసతి నిరాకరణ సహా తలెత్తిన దౌర్జన్యపూరిత వాతావరణం పట్ల ఉభయవర్గాలు తీవ్ర ఆందోళన ప్రకటించాయి. శాంతియుత, సురక్షిత, సుస్థిర ఆఫ్గనిస్తాన్ పునరుద్ధరణకు బలమైన మద్దతు ప్రకటిస్తూ ఆఫ్గన్ ప్రజలకు మానవతాపూర్వకమైన సహాయం కొనసాగించనున్నట్టు ధ్రువీకరించాయి.
- ఆఫ్గన్ భూభాగాన్ని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేందుకు, శిక్షణకు, ఉగ్రవాద దాడుల ప్రణాళికకు, ఆర్థిక సహాయానికి కేంద్రంగా వినియోగించరాదని గట్టిగా కోరుతూ ఇందుకు సంబంధించిన యుఎన్ఎస్ సి తీర్మానం 2593 (2021) ప్రాధాన్యతను పునరుద్ఘాటించాయి. ఆఫ్గన్ పరిస్థితిపై సన్నిహిత సంప్రదింపులు కొనసాగించాలని ఉభయులు అంగీకరించారు.
- అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాద ప్రేరేపిత శక్తులు జరిపే సీమాంతర ఉగ్రవాద చర్యలను ఉభయ దేశాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల సురక్షిత ప్రదేశాలను, మౌలిక వసతులను, విచ్ఛిన్నకర ఉగ్రవాద నెట్ వర్క్ లను, ఆర్థిక సహాయ వనరులను అంతర్జాతీయ మానవతా చట్టం సహా విభిన్న అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని వారు అన్ని దేశాలకు పిలుపు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్ సి) 1267 ఆంక్షల కమిటీ ప్రకటించిన ఉగ్రవాద బృందాలు సహా అన్ని రకాల ఉగ్రవాద బృందాలపై సంఘటిత చర్యలు తీసుకోవాలని కూడా వారు పిలుపు ఇచ్చారు. ఉగ్రవాద బృందాలు, వ్యక్తులపై ఆంక్షల విషయంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడాన్ని కొనసాగించేందుకు, తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించేందుకు, ఉగ్రవాదుల ఇంటర్నెట్ వినియోగాన్ని, సీమాంతర కదలికలను నిలువరించేందుకు కట్టుబాటు ప్రకటించాయి.
- అన్ని దేశాలు మనీ లాండరింగ్ నిరోధక అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించవలసిన, ఉగ్రవాద ఆర్థిక సహాయానికి వ్యతిరేకించవలసిన ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ ఇందులో ప్రపంచ సహకారాన్ని పటిష్ఠం చేసే ఎఫ్ఏటిఎఫ్ సహా ప్రపంచ సహకార వ్యవస్థ నియమావళిని పాటించాలని, ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
- ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక పునరుద్ధరించి పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు, ఈ దిశగా సంప్రదింపులు సత్వరం ముగించేందుకు ఉభయ దేశాలు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాయి. ఇందులో ఐఏఇఏ ప్రధాన పాత్రను జర్మనీ, భారత్ ప్రశంసించాయి.
- భద్రతా సహకారం మరింత లోతుగా పాదుకునేందుకు కృషి చేయాలని, ఇందుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సహాయపడే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని ఉభయ వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రపంచ భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొనే వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ఉభయులు ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారం మరింత లోతుగా విస్తరించుకోవాల్సిన అవసరం ఉభయులు గుర్తించారు. భద్రత, రక్షణ అంశాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత ముమ్మరం చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఇయు వ్యవస్థ పరిధిలో ద్వైపాక్షికంగాను, ఇతర భాగస్వాములతో కలిసి ఈ విభాగంలో పరిశోధన, ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి కార్యకలాపాలు చురుగ్గా చేపట్టాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి. సైబర్ రంగంలో ద్వైపాక్షిక సంప్రదింపులు క్రమం తప్పకుండా కొనసాగించాలని, రక్షణ టెక్నాలజీ సబ్ గ్రూప్ (డిటిఎస్ జి) తిరిగి సమావేశపరచాలని ఉభయులు అంగీకరించారు. రక్షణ వస్తువులు సహా అత్యున్నత సాంకేతిక వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మద్దతు ఇవ్వాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి.
హరిత, స్థిర అభివృద్ది భాగస్వామ్యం
- భూగోళ పరిరక్షణకు, ఏ ఒక్కరూ వెనుకబడి ఉండిపోకుండా చూసుకుంటూ అందరి సమ్మిళిత వృద్ధికి ఉమ్మడి బాధ్యత వహించాలని ఉభయ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలను పారిశ్రామిక తిరుగుబాటు కాలం నాటి 2 డిగ్రీల సెల్సియస్ కు నిలువరిస్తూ తదుపరి దశలో పారిశ్రామిక తిరుగుబాటు ముందు కాలం నాటి 1.5 డిగ్రీల సెల్సియస్ కు కుదించేందుకు పారిస్ ఒప్పందం, ఎస్ డిజిల పరిధిలో వాతావరణ కార్యాచరణ ప్రణాళిక, భారత-జర్మన్ స్థిర అభివృద్ది సహకారం ప్రాధాన్యతను ఉభయ దేశాల నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రంగాల్లో ఉభయ దేశాలు ప్రకటించిన కట్టుబాట్ల అమలును వేగవంతం చేస్తూ హరిత, స్థిర అభివృద్ధికి భారత-జర్మనీ దేశాల భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటనను అమలుపరిచేందుకు ఎదురు చూస్తున్నట్టు వారు ప్రకటించారు. పారిస్ ఒప్పందం, ఎస్ డిజిల అమలులో ద్వైపాక్షిక, త్రైపాక్షిక, బహుముఖీన సహకారం మరింత ముమ్మరం చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది. గ్లాస్గోలో సిఓపి26 సమయంలో భారత, జర్మనీ ప్రకటించిన ఎస్ డిజి లక్ష్యాలు, వాతావరణ టార్గెట్ల కాలపరిమితికి లోబడి 2030 నాటికి వాటిని సాధించే దిశగా ఉమ్మడిగా కృషి చేయడంతో పాటు ఆయా లక్ష్యాల సాధనలో అనుభవాలు పంచుకోవాలని నిర్ణయించాయి. ఈ భాగస్వామ్యం కింద ప్రకటించిన అదనపు కట్టుబాట్లను నిర్దేశిత కాలపరిమితి 2030 లోగా పూర్తి చేసేందుకు భారతదేశానికి 10 బిలియన్ యూరోల ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు జర్మనీ సంసిద్ధత ప్రకటించింది. వాతావరణ కార్యాచరణ, స్థిర అభివృద్ధి విభాగాల్లో ప్రకటించిన ఆశావహమైన లక్ష్యాలను సాధించేందుకు; ఈ విభాగంలో భారత-జర్మనీ పరిశోధన, అభివృద్ధి విస్తరణకు, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకునేందుకు ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. వర్తమాన, భవిష్యత్ కట్టుబాట్లను తుచ తప్పకుండా అమలుపరచాల్సిన ప్రాధాన్యతను భారత, జర్మనీ నొక్కి చెప్పాయి.
- భాగస్వామ్యానికి మరింత ఉన్నత స్థాయి రాజకీయ భాగస్వామ్యం సాధించే దిశగా అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల వ్యవస్థ (ఐజిసి) పరిధిలో ద్వైవార్షిక మంత్రివర్గ సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటు చేసుకునేందుకు ఉభయులు అంగీకరించారు. వాతావరణ కార్యాచరణ ప్రణాళిక, స్థిర అభివృద్ధి, ఇంధన పరివర్తన, అభివృద్ధి సహకారం, త్రైపాక్షిక సహకారం విభాగాల్లో ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక కార్యాచరణలు మంత్రివర్గ యంత్రాంగం పరిధిలో ఈ భాగస్వామ్యం మరింతగా విస్తరించడానికి దోహదపడతాయి.
- ఇంధన పరివర్తన, పునరుత్పాక ఇంధనం, స్థిర పట్టణాభివృద్ధి, హరిత రవాణా యంత్రాంగం, సర్కులర్ ఎకానమీ, వాతావరణ కార్యాచరణ ప్రణాళిక, వాతావరణ మార్పుల పరిష్కారం; జీవ వైవిధ్య పరిరక్షణ, స్థిర వినియోగం; వాతావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల స్థిర వినియోగం విభాగాల్లో చేపట్టాల్సిన చర్యలను గుర్తించేందుకు ఉభయ వర్గాలు కృషి చేస్తాయి. అలాగే ఈ భాగస్వామ్య లక్ష్యాల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించుకుంటాయి.
- భారత-జర్మనీ హరిత, స్థిర అభివృద్ధి భాగస్వామ్యం కింద ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చిన చర్యలు...
- భారత-జర్మనీ హరిత హైడ్రోజెన్ టాస్క్ ఫోర్స్ అందించిన సూచనలకు అనుగుణంగా భారత-జర్మనీ ఇంధన ఫోరమ్ (ఐజిఇఎఫ్) మద్దతుతో భారత-జర్మన్ హరిత హైడ్రోజెన్ రోడ్ మ్యాప్ రూపకల్పన
- ఆధునిక సోలార్ ఇంధన, పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తూ వాటితో ముడిపడి ఉన్న విద్యుత్ గ్రిడ్ లు, స్టోరేజి వసతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఇంధన పరివర్తనకు దోహదపడే ఇండో-జర్మన్ పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య వ్యవస్థ రూపకల్పన. సోలార్ టెక్నాలజీల్లో సర్కులర్ ఎకానమీ మద్దతు వ్యవస్థలకు కూడా ఈ భాగస్వామ్యం అవకాశం కల్పిస్తుంది. అత్యున్నత నాణ్యత గల ప్రాజెక్టుల తయారీ, నిధుల లభ్యత ఆధారంగా 2020-2025 మధ్య కాలంలో ఈ విభాగంలో భారతదేశానికి 1 బిలియన్ యూరోల రాయితీ రుణాలు సహా ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు జర్మనీ సంసిద్ధత ప్రకటించింది.
- గ్రామీణ జనాభా, చిన్నకారు రైతులకు ఆదాయం, ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకత, భూసారం మెరుగుదల, జీవవైవిధ్యం, అడవుల పునరుద్ధరణ, జల వనరుల లభ్యత విభాగాల్లో ప్రయోజనం కల్పించే విధంగా వ్యవసాయ వాతావరణ, ప్రకృతి వనరుల స్థిర నిర్వహణ సహకారం ఏర్పాటు చేసుకోవడం, ఈ విభాగంలో భారత అనుభవాలను ప్రపంచంతో కూడా పంచుకోవడం. అత్యున్నత నాణ్యత గల ప్రాజెక్టుల తయారీ, నిధుల లభ్యత ఆధారంగా 2025 నాటికి ఈ విభాగంలో భారతదేశానికి 300 మిలియన్ యూరోల రాయితీ రుణాలు సహా ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు జర్మనీ సంసిద్ధత ప్రకటించింది.
- లే-హర్యానా ట్రాన్స్ మిషన్ లైన్, కర్బన రహిత లదాఖ్ ప్రాజెక్టు వంటి హరిత ఇంధన కారిడార్లకు మరింత సహకారం విస్తరణ
- పేదరిక నిర్మూలనపై పోరాటం; జీవ వైవిధ్య సంరక్షణ, పునరుద్ధరణ; వాతావరణ మార్పుల క్షీణత నిరోధం వంటివి నివారించుకునే కీలక ప్రయత్నాల్లో భాగంగా బాన్ చాలెంజ్ కింద అటవీ భూముల పునరుద్ధరణలో మరింత లోతైన సహకారం. రాజకీయ భాగస్వామ్యాలు, సంప్రదింపులు మరింత ముమ్మరంగా చేపట్టేందుకు, ఆరోగ్యవంతమైన వాతావరణ వ్యవస్థను పెంచడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి దశాబ్ది పర్యావరణ వ్యవస్థ 2021-2030ని ఆమోదిస్తూ దానికి అనుగుణంగా పర్యావరణ క్షీణత, నష్టాల నివారణకు చర్యలు చేపట్టడం.
- వాయుకాలుష్య ప్రదేశాల తగ్గింపు చర్యలు సహా హరిత టెక్నాలజీలను విజయవంతంగా, స్థిరంగా వినియోగించుకోగల పరిస్థితులు కల్పించడంలో మరింత లోతైన సహకారం
- వర్థమాన దేశాలు ఎస్ డిజి, వాతావరణ లక్ష్యాలు సాధించేందుకు మద్దతు ఇచ్చే విధంగా స్థిరమైన, దీర్ఘకాలిక మన్నిక గల, సమ్మిళిత ప్రాజెక్టుల రూపకల్పనకు వ్యక్తిగత బలాలు, అనుభవాల ఆధారిత వ్యవస్థల అభివృద్ధిలో త్రైపాక్షిక సహకారం కోసం కలిసికట్టుగా కృషి చేయడం
- హరిత, సుస్థిర అభివృద్ధికి భారత-జర్మన్ భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాల పురోగతిని ఉభయ దేశాలు ఆహ్వానించాయి.\
- 2006లో ప్రారంభించిన భారత-జర్మన్ ఇంధన ఫోరమ్ కింద భాగస్వామ్యంలో చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా విస్తరించుకోవడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
- ii. 2019లో ఢిల్లీలో సమావేశమైన భారత-జర్మన్ పర్యావరణ ఫోరమ్ (ఐజిఇఎన్ విఎఫ్) పరిధిలో సహకారం మరింతగా విస్తరించుకోవడం.ఉభయ దేశాల ఫెడరల్ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతీయ, పురపాలక అధికార యంత్రాంగాల బాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కృషి
- సిబిడి సిఓపి 15లో నిర్దేశించుకున్రన శక్తివంతమైన లక్ష్యాలకు అనుగుణంగా 2020 అనంతర ప్రపంచ జీవ వైవిధ్య ప్రణాళికకు ఉభయ దేశాలు 2021 ఫిబ్రవరిలో వర్చువల్ గా నిర్వహించిన జాయింట్ కార్యాచరణ బృంద సమావేశంలో ప్రకటించిన అంగీకారాలకు కట్టుబడుతూ మరింత వాస్తవిక సహకారం పెంపొందించుకునే దిశగా కృషి
- వేస్ట్, సర్కులర్ ఎకానమీ విభాగంలో కృషి చేస్తున్రన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సృష్టించిన మంచి అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉభయ దేశాల మధ్య సహకారం మరింతగా విస్తరించుకోవడానికి అంగీకరించారు. వ్య
|