సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రాష్ట్రపతి భవన్లో వైవిధ్యమైన అమృత మహోత్సవం- దక్షిణ భారత ఎడిషన్
ప్రజా సందర్శన: మార్చి 6 నుంచి 9 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2025 3:41PM by PIB Hyderabad
వార్షిక సాంస్కృతిక ఉత్సవమైన వైవిధ్యమైన అమృత మహోత్సవం (వివిధ కా అమృత్ మహోత్సవ్) వివిధ ప్రాంతాల ప్రత్యేక సంప్రదాయాలను ప్రదర్శిస్తూ భారత దేశ వైవిధ్య వారసత్వ సంపదను తెలియజేస్తోంది. ఈ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2025 మార్చి 5 న రాష్ట్రపతి భవన్లో ప్రారంభించనున్నారు. మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ప్రజలను అనుమతిస్తారు. గత సంవత్సరం నిర్వహించిన మొదటి ఎడిషన్ ఈశాన్య భారతదేశంపై దృష్టి సారించింది. అప్పుడు 1.3 లక్షల మంది సందర్శకులతో పాటు రూ. ఒక కోటి కంటే ఎక్కువ విలువైన విక్రయాలతో మంచి స్పందన వచ్చింది.
ఈ విజయం తర్వాత రెండో ఎడిషన్ దక్షిణ భారత్ ఇతివృత్తంగా జరుగుతోంది. ఇందులో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు లక్ష దీవులు, పుదుచ్చేరి ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ను సాంస్కృతిక మార్పిడికి కేంద్రంగా మార్చటం, దేశ వారసత్వ సంపదను పౌరులకు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
దక్షిణ భారత ఎడిషన్లో ముఖ్యమైన అంశాలు:
* కంజీవరం, కసావు చీరలు, పోచంపల్లి ఇక్కత్, మైసూరు పట్టు, ఇత్తడి, చెక్క కళారూపాలతో సహా హస్తకళలు, చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్న 500 మందికి పైగా కళాకారులు.
* జానపద, శాస్త్రీయ నృత్యం, సంగీత రూపాలను ప్రదర్శిస్తూ దక్షిణ భారతదేశ సంస్కృతికి జీవం పోయనున్న
400 మందికి పైగా కళాకారులు.
* బిసి బిళ్ల బాత్, కేరళ సద్య, చెట్టినాడ్ ప్రత్యేకతలు, ఆంధ్రుల ఘాటు రుచుల వంటి ప్రతిష్ఠాత్మక దక్షిణ భారత వంటకాలతో కూడా ప్రామాణిక వంటలు.
* యువతరానికి స్ఫూర్తినిచ్చేలా చర్చా రూపంలో వర్క్షాప్లు, కథలు చెప్పటం, సాంస్కృతిక కార్యక్రమాలతో యువతను ఉత్తేజపరిచే కార్యక్రమాలు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, దేశ వైవిధ్యమైన వారసత్వ సంపదను పరిరక్షించడం, ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మద్దతుతో ఈ ఉత్సవం జరుగుతోంది.
ప్రవేశం, ప్రజల భాగస్వామ్యం:
అందరినీ కలుపుకుని, అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు ఈ సాంస్కృతిక వేడుక ప్రవేశాన్ని పూర్తిగా ఉచితం చేశారు. ప్రతి ఒక్కరు దక్షిణ భారత సంప్రదాయాల గొప్పతనాన్ని ఎటువంటి ఆటకం లేకుండా అనుభూతి చెందే వీలు కల్పిస్తుంది.
ప్రజలకు పిలుపు:
ప్రజలందరు ప్రదర్శనకు రావాలని, కళాకారులతో సంభాషించి సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించి దక్షిణ భారత్ ఘన వారసత్వ సంపదను అనుభూతి చెందాలని కోరుతున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఉచిత టికెట్ను https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/amrit-udyan/rE/mO ద్వారా పొందవచ్చు.
రాష్ట్రపతి భవన్ గేట్ నం.35 నుంచి ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉంటుంది.
ఇ. కలంకారి బ్లాక్ ప్రింటింగ్
ఈ. సిల్వర్ ఫిలిగ్రీ
ఉ. జరీ, జర్దోజీ
3. పుదుచ్చేరి
అ. బ్లాక్ ప్రింటింగ్
ఆ. కొబ్బరి చిప్ప క్రాఫ్ట్
ఇ. టెర్రా కోట
4. కర్ణాటక
అ. చెన్నపట్న బొమ్మలు
ఆ. మైసూర్ రోజ్ వుడ్ ఇన్ లే
5. తమిళనాడు
అ. కోట కుండలు
ఆ. రాతి శిల్పాలు
ఇ. తంజావూరు పెయింటింగ్
Kindly click here for more details: -
***
(రిలీజ్ ఐడి: 2108703)
సందర్శకుల సూచీ సంఖ్య : : 70