ప్రధాన మంత్రి కార్యాలయం
హూల్ దివస్ సందర్భంగా గిరిజన వీరులకు ప్రధానమంత్రి నివాళులు
Posted On:
30 JUN 2025 2:28PM by PIB Hyderabad
ఆరాధనీయ ‘హూల్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత గిరిజనుల అజేయ ధైర్య, సాహసాలతో పాటు వారి అసాధారణ పరాక్రమానికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించారు. చరిత్రాత్మక సంథాల్ తిరుగుబాటును ప్రధానమంత్రి స్మరించుకొంటూ సిదో-కాన్హూ, చాంద్-భైరవ్లతో పాటు ఫూలో-ఝానోలతో పాటు వలస పాలకుల పీడనకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవనాన్ని త్యాగం చేసిన పూజనీయ స్వాతంత్ర్య వీరులు, వీరాంగనలందరి శాశ్వత వారసత్వానికి జోహార్లు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో పొందుపరిచిన ఒక సందేశంలో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘హూల్ దివస్ మన ఆదివాసీ సమాజంలోని అజేయ సహసంతో పాటు అద్భుత పరాక్రమాన్ని మనకు గుర్తు చేస్తుంది. చరిత్రాత్మక సంథాల్ తిరుగుబాటుతో ముడిపడ్డ ఈ ప్రత్యేక సందర్భం సిదో-కాన్హూ, చాంద్-భైరవ్లతో పాటు ఫూలో-ఝానోలతో పాటు విదేశీ పాలనలో దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాల్ని త్యాగం చేసిన వీరులు, వీరాంగనలు అందరికీ మనస్ఫూర్తిగా నమస్సులు, వందనాలను అర్పిస్తున్నాను. వారి శౌర్యగాథలు దేశంలో ప్రతి తరానికీ మాతృభూమి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’
***
(Release ID: 2140792)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam