ప్రధాన మంత్రి కార్యాలయం
పదేళ్ల డిజిటల్ ఇండియా ప్రస్థానానికి ప్రధాని ప్రశంసలు
Posted On:
01 JUL 2025 9:40AM by PIB Hyderabad
విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దశాబ్దం తర్వాత ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన, నవయుగ సాధికారతకు నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షులుగా నిలిచామని ప్రధాని పేర్కొన్నారు. ‘‘140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పంతో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ గొప్ప పురోగతిని సాధించింది.’’
మైగవ్ఇండియా ఎక్స్లో చేసిన పోస్టును పంచుకుంటూ ప్రధాని ఇలా అన్నారు:
‘‘#10YearsOfDigitalIndia ను జరుపుకొంటున్న ఈ రోజు చరిత్రాత్మకం!
పదేళ్ల కిందట, మన దేశాన్ని డిజిటల్ సాధికారత సాధించిన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజంగా మార్చడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది.
దశాబ్దం తర్వాత, ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన, నవయుగ సాధికారతకు నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షులుగా నిలిచాం. 140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పంతో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ గొప్ప పురోగతిని సాధించింది. ఆరోగ్యం, విద్య లాంటి రంగాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాయి.
ఈ మార్పులను, వాటి ప్రభావానికి సంబంధించిన వివరాలను ఈ పోస్టు మీకు అందిస్తుంది!’’
***
(Release ID: 2141121)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam