ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
తమిళనాడులోని పరమకుడి - రామనాథపురం విభాగాన్ని (ఎన్హెచ్-87) రూ. 1853 కోట్ల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు క్యాబినెట్ ఆమోదం
Posted On:
01 JUL 2025 3:13PM by PIB Hyderabad
తమిళనాడులోని పరమకుడి- రామనాథపురం మధ్య 46.7 కి.మీ మేర 4 వరుసల రహదారిని నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో (హెచ్ఏఎం) రూ. 1,853 కోట్ల మూలధన వ్యయంతో చేపట్టనున్నారు.
మధురై, పరమకుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోటి మధ్య అనుసంధానం ప్రస్తుతం ఉన్న 2 వరుసల జాతీయ రహదారిపై, రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. అధిక ట్రాఫిక్ వల్ల ఈ రహదారులన్నీ ఇరుకుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కీలక పట్టణాలతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు పరమకుడి నుంచి రామనాథపురం వరకు దాదాపు 46.7 కి.మీ మేర జాతీయ రహాదారి-87ను నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇది రద్దీని తగ్గించి, భద్రతను మెరుగుపరటమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరమకుడి, సత్తిరకుడి, అచుందన్వాయల్, రామనాథపురం పట్టణాల రవాణా అవసరాలను తీరుస్తుంది.
ఈ మార్గం 5 ప్రధాన జాతీయ రహదారులైన ఎన్హెచ్-38, ఎన్హెచ్-85, ఎన్హెచ్-36, ఎన్హెచ్-536, ఎన్హెచ్-32లను.. 3 రాష్ట్ర రహదారులైన ఎస్హెచ్-47, ఎస్హెచ్-29, ఎస్హెచ్-34లను కూడా అనుసంధానిస్తుంది. ఇది దక్షిణ తమిళనాడు వ్యాప్తంగా కీలకమైన ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు ఆటంకం లేని అనుసంధానతను అందించనుంది. ఈ కారిడార్ 2 ప్రధాన రైల్వే స్టేషన్లు (మధురై, రామేశ్వరం), 1 విమానాశ్రయం (మదురై), 2 చిన్న ఓడరేవులను (పాంబన్, రామేశ్వరం) కూడా కలుపుతుంది. ఈ మార్గం బహుళ నమూనా అనుసంధానతను అందిస్తూ ఈ ప్రాంతంలో వస్తువులు, ప్రయాణికులు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లటాన్ని వేగవంతం, సులభతరం చేయనుంది.
నిర్మాణం పూర్తయిన అనంతరం పరమకుడి-రామనాథపురం ఈ ప్రాంత ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ప్రధాన మతపరమైన, ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానతను బలోపేతం చేయనుంది. రామేశ్వరం, ధనుష్కోటి పర్యాటకాన్ని పెంచనుంది. వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 8.4 లక్షల పనిదినాలు, పరోక్షంగా 10.45 లక్షల పనిదినాల ఉపాధి లభించనుంది. దీని నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాలలో వృద్ధి, అభివృద్ధి, సంపద సృష్టిలో కొత్త అవకాశాలను తీసుకురానుంది.
అంశం
|
వివరాలు
|
ప్రాజెక్టు పేరు
|
4 వరుసల పరమకుడి - రామనాథపురం విభాగం
|
విభాగం
|
మధురై - ధనుష్కోటి కారిడార్ (ఎన్హెచ్-87)
|
పొడవు (కి.మీ)
|
46.7
|
మొత్తం వ్యయం (రూ. కోట్లు)
|
997.63
|
భూ సేకరణ ఖర్చు (రూ. కోట్లు)
|
340.94
|
మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లు)
|
1,853.16
|
నిర్మాణ పద్ధతి
|
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం)
|
అనుసంధానం కానున్న ప్రధాన రహదారులు
|
జాతీయ రహదారులు: ఎన్హెచ్-38, ఎన్హెచ్-85, ఎన్హెచ్-36, ఎన్హెచ్-536, ఎన్హెచ్-32
రాష్ట్ర రహదారులు: ఎస్హెచ్ -47, ఎస్హెచ్ -29, ఎస్హెచ్- 34
|
అనుసంధానం కానున్న ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలు
|
చిన్న తరహా ఓడరేవులు: పంబన్, రామేశ్వరం
|
అనుసంధానం కానున్న ప్రధాన నగరాలు, పట్టణాలు
|
మధురై, పరమకుడి, రామనాథపురం, రామేశ్వరం
|
ఉపాధి కల్పన సామర్థ్యం
|
ప్రత్యక్షంగా 8.4 లక్షల పనిదినాలు, పరోక్షంగా 10.5 లక్షల పనిదినాలు
|
2024-25లో రోజువారీ వార్షిక సగటు ట్రాఫిక్ (ఏఏడీటీ)
|
అంచనా- 12,700 ప్రయాణ కార్ యూనిట్లు (పీసీయూ)
|
***
(Release ID: 2141212)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam