ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ తో ప్రధానమంత్రి భేటీ
Posted On:
11 OCT 2025 10:11PM by PIB Hyderabad
భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
శ్రీ సెర్జియో గోర్ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ని కలవటం సంతోషంగా ఉంది. ఆయన పదవీకాలంలో భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నాకు నమ్మకం ఉంది’’.
(Release ID: 2178058)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam