ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ తో ప్రధానమంత్రి భేటీ

Posted On: 11 OCT 2025 10:11PM by PIB Hyderabad

భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

శ్రీ సెర్జియో గోర్ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుఆయన ఆధ్వర్యంలో భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ని కలవటం సంతోషంగా ఉందిఆయన పదవీకాలంలో భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నాకు నమ్మకం ఉంది’’.


(Release ID: 2178058) Visitor Counter : 8